
సౌత్ జోన్ హాకీ పోటీలకు పమిడిముక్కల విద్యార్థులు
పమిడిముక్కల: తుంకూర్(బెంగళూరు)లో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగబోయే సౌత్ జోన్ హాకీ చాంపియన్షిప్ పోటీలకు పమిడిముక్కల హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం వై.దుర్గాభవాని తెలిపారు. బాలుర విభాగంలో కౌశిక్, రఘునాఽథ్, రోహిత్కుమార్, జిగ్నేష్, లోకేష్బాబు, బాలికల విభాగంలో విజయలక్ష్మి, హిమబిందు, ఆరాధ్య, లక్ష్మీప్రియ, శ్రీవల్లి, దేవిశ్రీ, సాయి మహాలక్ష్మి, సాయిశ్రీ ఎంపికై నట్లు తెలిపారు. హైస్కూల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, పీడీ నారాయణను హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఎన్ఎంసీ చైర్మన్ రావూరి సుకన్య అభినందించారు.
కొనసాగిన పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడో రోజైన సోమవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 149, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 133 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 135 మంది సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం పూర్తైంది. మొత్తం 417 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
నేటి షెడ్యూల్
మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 50001 నుంచి 56 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 56001 నుంచి 62 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 62001 నుంచి 68 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు.
నాట్య రాత పరీక్షలు
ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాఽథశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీని వాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షలో 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెం డెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు.
ముక్కపాడు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
గన్నవరం: ఉంగుటూరు మండలం ముక్కపాడు ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన వైద్యుల బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. డాక్టర్ అనూప్, డాక్టర్ రిచామిశ్రా బృందం ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించింది. కేంద్రం పరిధిలోని గర్భిణులు, చిన్నపిల్లలు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఔషధాలు, వ్యాక్సినేషన్ స్టాక్ తదితర అంశాలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సత్వర వైద్య సేవలందించాలని, చిన్నపిల్లలు, బాలింతలకు వ్యాక్సిన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఉంగుటూరు పీహెచ్సీ వైద్యాధికారి విజయ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

సౌత్ జోన్ హాకీ పోటీలకు పమిడిముక్కల విద్యార్థులు

సౌత్ జోన్ హాకీ పోటీలకు పమిడిముక్కల విద్యార్థులు