మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025
కూటమి ప్రభుత్వం తనలాంటి విద్యార్థులెందరినో మోసగించింది. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువే ఇస్తామని ప్రగల్బాలు పలికి నేడు తనతో పాటు అర్హత ఉన్న పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేయడం లేదు. కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. – ప్రసాద్,
బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, పెనమలూరు
●
చిలకలపూడి(మచిలీపట్నం)/మచిలీపట్నంటౌన్: కూటమి చేస్తున్న మోసాలపై యువత, నిరుద్యోగులు కదం తొక్కారు. మోసం చేసినందుకు వారంతా పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రశ్నించారు. ఏడాది పూర్తయినా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగభృతి పేరుతో ఒక్కొక్కొరికి రూ. 36 వేలు బకాయిలు పడింది. 2025–26 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించని సర్కారు ఏ విధంగా హామీలు అమలు చేస్తుందో తెలపాలని యువత ప్రశ్నించింది. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని యువత పోరులో నిలదీసింది. నిరుద్యోగులకు చేసిన మోసాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన యువత పోరులో నిరసన గళం విప్పింది. పార్టీ కృష్ణా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగమాల శ్రీకాళేశ్వరరావు (కాళి) అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
జగన్ వెంటే నడుద్దాం
రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ నేతలు వారి అవసరాలు తీర్చుకున్నారే తప్ప ప్రజల ఇక్కట్లు తీర్చలేదన్నారు. హామీలు కచ్చితంగా అమలు చేసే పార్టీలో మనం ఉన్నామని ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా జగన్ వెంటే నడుద్దామన్నారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారే మహంతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా వేల సంఖ్యలో హాజరుకావటం చూస్తుంటే ఆయనకు ఉన్న ఆదరణ ఏమిటో తెలుస్తోందన్నారు. వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల వంశీకృష్ణారావు మాట్లాడుతూ చంద్రబాబు హామీలు నమ్మి బలైపోయామన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ కాశిం మాట్లాడుతూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూర్ణ సాగర్, వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు పతివాడ రాఘవరావు (చిన్నారి), పాలేటి చంటి, ఎస్టీ సెల్ నేత వీరబ్రహ్మేంద్రనాయక్, కల్చరల్ వింగ్ నేత గుమ్మడి విజయ్కుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్, వైఎస్సార్ టీయూసీ నేత తాడిశెట్టి శ్రీనివాసరావు, సోషల్ మీడియా వింగ్ చింతలపూడి లక్ష్మీనారాయణ, పబ్లిసిటీ వింగ్ అద్దేపల్లి చందు, ఇంటెలెక్చువల్ వింగ్ నితీష్చంద్ర, ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ నేత తోట సీతారామాంజనేయులు, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), షేక్ అచ్చెబా, లంకా సూరిబాబు, శీలం బాబ్జి, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్ నెహ్రూ, కొలుసు హరిబాబు, తిరుమలశెట్టి ప్రసాద్, కార్పొరేటర్లు, నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి అనుబంధ విభాగాల నాయకులు ర్యాలీగా కలెక్టర్కు తరలివెళ్లి డీఆర్వో కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు.
కూటమి పాలకులు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు చూపక పోగా ఇస్తానన్న నిరుద్యోగ భృతిని సైతం మర్చిపోయారు. పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఫలితంగా నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నాం. కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తైనా నిరుద్యోగులను ఆదుకోకపోవడం దుర్మార్గం.
– జుజ్జువరపు పృధ్వీరాజు, నిరుద్యోగి, రాజుపేట
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పని చేసిన వలంటీర్లను కూటమి పాలకులు తీవ్రంగా మోసగించారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన తనలాంటి ఎంతో మంది వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబునాయుడు నాడు ప్రకటించారు. ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాది కాలం పూర్తయినా ఆయన వలంటీర్ల ఊసే ఎత్తడంలేదు. ఈ వ్యవస్థను కొసాగిస్తాని చెప్పి ఏడాదైనా అమలు చేయకుండా మిన్నకుండిపోయారు.
– భట్రాజు కొండబాబు, మచిలీపట్నం
7
న్యూస్రీల్
కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన గళం
20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఎక్కడ? నిరుద్యోగులకు భృతి ఏది? యువతకు ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ను ఎగ్గొట్టింది చంద్రబాబు కాదా? వైఎస్సార్ సీపీ యువత పోరులో ప్రశ్నించిన నేతలు
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా