దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400 | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

Jun 24 2025 4:21 AM | Updated on Jun 24 2025 4:21 AM

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్‌ పర్యవేక్షించగా అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ పోలీసులు పాల్గొన్నారు.

చల్లపల్లి విద్యార్థికి

జాతీయస్థాయి గుర్తింపు

చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన విద్యార్థి వేముల హేమంత్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చల్లపల్లికి చెందిన వ్యాపారి వేముల పాండురంగారావు, దీపిక దంపతుల కుమారుడు హేమంత్‌ విజయవాడలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) చదివి ప్రస్తుతం ఆర్టికల్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 2024 జూన్‌లో నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) పరీక్షల్లో కళాశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన హేమంత్‌ జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. న్యూఢిల్లీలో సోమవారం ఐసీఎంఏఐ ఆధ్వర్యంలో 12వ నేషనల్‌ స్టూడెంట్‌ కాన్వకేషన్‌–2025 జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఐసీఎంఏఐ అధ్యక్షుడు బిభూతి భూషణ్‌ నాయక్‌ చేతుల మీదుగా వేముల హేమంత్‌ ధ్రువపత్రాన్ని, పతకాన్ని అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement