కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

కొనసా

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్‌–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ రెండో రోజైన ఆదివారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో 145, మాచ వరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 119 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 91 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 355 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్‌ ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్టినేటర్‌ ఎం.విజయసారథి తెలిపారు.

నేటి షెడ్యూల్‌ ఇదీ

సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 32001 నుంచి 38 వేల ర్యాంకు వరకు, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 38001 నుంచి 44 వేల ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 44001 నుంచి 50 వేల ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు.

ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శుల

సంఘం ఎన్నిక

కంచికచర్ల: ఎన్టీఆర్‌ జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంఘ ఎన్నికలు గొల్లపూడి దత్త కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయని ఎన్నికల అధికారి (డెప్యూటీ ఎంపీడీఓ) ఎంవీ ప్రసాద్‌ తెలిపారు. జిల్లా కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా ఇందుపల్లి నానిబాబు(కంచికచర్ల మండలం చెవిటికల్లు), ఉపాధ్యక్షుడు టి.సాంబశివరావు(వీరులపాడు మండలం కొనతాలపల్లి), ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరెడ్డి(జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం), జాయింట్‌ సెక్రటరీ పి.గోపీకృష్ణ(వత్సవాయి మండలం మక్కపేట), కోశాధికారి ఏ నరేష్‌(పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం), కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ రమణ తదితరులు పాల్గొన్నారు.

నేడు దుర్గగుడి

మాస్టర్‌ప్లాన్‌పై సమీక్ష

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహామండపంలోని ఏడో అంతస్తులో సమీక్ష నిర్వహిస్తారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్‌ప్లాన్‌ అమలుపై దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆలయ ఈవో శీనానాయక్‌ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్‌, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ దుకాణాలను తరలిస్తేనే అభివృద్ధి పనులకు అటంకం లేకుండా సకాలంలో పూర్తి చేసే వీలుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

పేకాట కేసులో టీడీపీ 30వ డివిజన్‌ ఇన్‌చార్జి!

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): పేకాట కేసులో 30వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి కరణం వెంకటరమణను ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకనగర్‌లో ఆదివారం పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో 30వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి కరణం వెంకటరమణ కూడా ఉన్నారని తెలిసింది. దీంతో టీడీపీ నాయకులు ఈ కేసు నుంచి వెంకటరమణను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇదే డివిజన్‌కు చెందిన ఎమ్మెల్యే పీఏ.. కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కొనసాగుతున్న                సర్టిఫికెట్ల పరిశీలన 1
1/2

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

కొనసాగుతున్న                సర్టిఫికెట్ల పరిశీలన 2
2/2

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement