జగన్మాతకు జేజేలు | - | Sakshi
Sakshi News home page

జగన్మాతకు జేజేలు

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

జగన్మాతకు జేజేలు

జగన్మాతకు జేజేలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తజనం జగన్మాతకు జేజేలు పలికారు. నగరంలోని దుర్గ గుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమైన భక్తుల సందడి సాయంత్రం వరకు కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో అమ్మవారి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లోక కల్యాణార్థం ఆదివారం ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం కల్పించగా, రూ. 100 టికెట్‌పై రెండు క్యూలైన్లు నడిచాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పల్లకీ సేవ జరిగింది.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఆర్జిత సేవల్లో ఉభయదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement