
‘డ్వాక్రా’కు భరోసా..
డ్వాక్రా సభ్యులకు ఆర్థిక చేయూతను అందించాలని వారు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీతో పాటు రుణమాఫీ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత సున్నా వడ్డీ, జగనన్న తోడు పథకాల ద్వారా వారికి ఆర్థ్ధిక చేయూతను అందించారు. ఈ మూడు పథకాల ద్వారా కృష్ణాజిల్లాలో 1,35,745 మందికి గత ఐదేళ్లలో రూ. 135.75కోట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,45,685 మంది లబ్ధిదారులకు రూ. 464.16కోట్లు అందజేశారు.
అన్నింటా మొండిచెయ్యి..
డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పి ఇంత వరకు వారికి ఎటువంటి ఆర్థిక ఆసరాలు ప్రకటించలేదు. గతంలో డ్వాక్రా గ్రూపులను తామే ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు డ్వాక్రా మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు.