అంకితబావంతో పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితబావంతో పని చేయాలి

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

అంకిత

అంకితబావంతో పని చేయాలి

చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. ఆమె చాంబర్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ పరిధిలో విధి నిర్వహణలో పని చేస్తూ అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వాటిని భర్తీ చేశామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులను పారదర్శకంగా ఇచ్చి, వారు కోరిన ప్రాంతాలకు బదిలీ చేశామని చెప్పారు. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌లుగా ఏడుగురికి, సీనియర్‌ అసిస్టెంట్‌ల నుంచి ఏవోలుగా ఇద్దరికి నియామక పత్రాలు అందజేశామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురికి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా, ఒకరిని ఆఫీస్‌ సబార్డినేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జెడ్పీ సీఈవో ఎ.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్‌.సి. ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబద్ధతతో పనిచేయాలి..

చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ నియామక పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ మంగళవారం రాత్రి అందజేశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖలలో 8 మందికి జూనియర్‌ అసిస్టెంట్లుగాను, ఇరువురికి ఆఫీసు సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంకితభావంతో అప్పగించిన విధులను నిర్వర్తించి పనిచేస్తున్న శాఖలలో అధికారుల మన్ననలను పొందాలని వారికి కలెక్టర్‌ సూచించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్‌ ఏవీఓ సీహెచ్‌ వీరాంజనేయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక

అంకితబావంతో పని చేయాలి 1
1/1

అంకితబావంతో పని చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement