
పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ
పామర్రు: బీసీ సంక్షేమ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోరల్ అధికారి జి.రమేష్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీఓను అనుసరించి వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల బదిలీలకు అర్హత గల వారి వివరాలను గత నెల 30న జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. వార్డెన్లు బదిలీలపై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అదే విధంగా కొందరు మహిళా వార్డెన్ల్పై బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమాచారం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని పేర్కొన్నారు.