
మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో పాలకులు తిరకాసు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు.. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హ్యాండీక్యాప్డ్, విడోస్, డిపెండెంట్ పేరెంట్స్, సెల్ఫ్ డిసీజెస్ ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాలల్లో 40 శాతం, ఉన్నత పాఠశాలలో 50 శాతం పోస్టులు మాత్రమే కోరుకోవాలనే నిబంధన విధించింది. గత ప్రభుత్వాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ప్రిఫరెన్షియల్ క్యాటగిరీలో ఎటువంటి నిబంధనలు లేకుండా కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాయి.
నిబంధన సరికాదు
అయితే కూటమి ప్రభుత్వం విరుద్ధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరిపై చిన్నచూపు చూస్తూ నిబంధనలు విధించింది. ఎన్నో లోపాలు, సమస్యలు ఎదుర్కొని ఉద్యోగం సాధించి నిజాయతీగా పని చేస్తున్న పరిస్థితుల్లో కొన్ని పోస్టులు మాత్రమే కేటాయించి వాటిని మాత్రమే కోరుకోవాలన్న నిబంధన సరైనది కాదని అనేకమంది ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉద్యోగుల హక్కులపై దాడిగా ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో..
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 997 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో 25,251 మంది, 153 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 1,693 మంది, 217 హైస్కూళ్లలో 56,197 మంది విద్యార్థులు చదువు అభ్యసిస్తున్నారు. మొత్తం 1,367 పాఠశాలల్లో సుమారు 92,141 మంది విద్యార్థులకు 10,445 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్లో బదిలీల దరఖాస్తులు
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ విద్యాశాఖ ప్రారంభించింది. వీటిని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలలకు నిర్వహిస్తున్నారు. తొలుత మే 22 వరకు హెచ్ఎంలు, ఆదివారంతో స్కూల్ అసిస్టెంట్స్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఎస్జీటీల ఆన్లైన్దరఖాస్తులు స్వీకరణ నేటితో ముగియనుంది.
న్యూస్రీల్
కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా పరిమితులు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో తక్కువ ఎంపిక అవకాశాలు ప్రాథమిక స్కూళ్లలో 40 శాతం.. ఉన్నత పాఠశాలల్లో 50 శాతం పోస్టులే కోరుకోవాలనే నిబంధన ఉపాధ్యాయులకు తలనొప్పిగా పరిణమిస్తున్న వైనం గత ప్రభుత్వాల్లో కోరుకున్న పాఠశాలలకే బదిలీ అవకాశం
బదిలీలు ఇలా..
ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మొత్తం 140 ఖాళీలను విద్యాశాఖ గుర్తించింది. అందులో 6 ప్రభుత్వ పాఠశాలల్లో, 140 లోకల్ బాడీస్ నిర్వహిస్తున్న స్కూళ్లలో, 20 మున్సిపల్ యాజమాన్య పాఠ శాలలు ఉన్నాయి. ఇప్పటికే సీనియార్టీ జాబితా అనంతరం 115 మంది లోకల్ బాడీస్ నిర్వహిస్తున్న పాఠశాలకు, ఆరుగురు గవర్నమెంట్, 20 మంది మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల ప్రొవిజినల్ జాబితా విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్ అసి స్టెంట్ ట్రాన్స్ఫర్ పాయింట్లతో కూడిన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) బదిలీలకు గుర్తించిన ఖాళీలు మొత్తం 1,455 వాటిలో 230 ఎస్ఏ ఇంగ్లిష్, 273 బయోలాజికల్ సైన్స్, 154 ఎస్ఏ హిందీ, 173 ఎస్ఏ పీడీ, 06 ఎస్ఏ సంస్కృతం, 278 ఎస్ఏ గణితం, 230 ఎస్ఏ ఫిజికల్ సైన్స్, 103 ఎస్ఏ తెలుగు, 8 ఎస్ఏ ఉర్దూ, 1,614 ఎస్జీటీలుతో పాటు 41 ఎస్జీటీ ఉర్దూ ఖాళీలు ఉన్నాయి.

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025