
ప్రభుత్వమే ఆదుకోవాలి
పంచాయతీల ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు బాగా పెరిగాయి. ఇటీవల రిక్షాలు కొనుగోలు చేయాలని, క్లాప్మిత్రలను పెట్టుకోవాలని అధికారులు చెప్పడంతో పాలుపోని దుస్థితి. ప్రభుత్వమే పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి. రిక్షాలు కొనుగోలు చేసి పంచాయతీలకు ఇవ్వాలి. ఈ రిక్షాలు కూడా మోటర్సైకిల్గా ఉండాలి. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉంటుంది. తొక్కుకుంటూ వెళ్లా లంటే క్లాప్మిత్రలకు ఇబ్బందికర పరిస్థితి. క్లాప్మిత్రల జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుంది.
–గరికపాటి వెంకట రామానాయుడు,
సర్పంచు, పెనుమల్లి, పెడన