
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
గుడివాడరూరల్: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులతో కలసి నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రధానంగా తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం పనులు, ఇరిగేషన్, డ్రైనేజీ, వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, రహదారులు, భవనాలు పీఎం సూర్యఘర్, ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని దనియాలపేటతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఆదేశించారు. గుడివాడ టిడ్కో గృహ సముదాయంతో పాటు నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే రాము కలెక్టర్కు వివరించగా ఆ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. తాగునీటి సమస్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం పనితీరు మార్చుకోవడం లేదని, తీరు మార్చుకుని పని చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నియోజక వర్గంలో గృహ నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిమెంటు, ఇనుము, ఇసుక వంటి సామగ్రి అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీనాయక్ను కలెక్టర్ ప్రశ్నించారు. పనితీరు మార్చుకుని వీలైనంత త్వర గా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖ ర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నటరాజన్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారి నరసింహు లు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, వా సే మురళి, కర్రే వెంకటగిరి, గోవాడ శివ, అన్ని ప్ర భుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
వేసవిలో తాగునీటి సమస్య
తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే రాముతో కలసి
అధికారులతో సమీక్ష