
సౌకర్యాలతో ఆధునిక బోధన
సాక్షి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతుంది? జిల్లాలో ఇప్పటికే 34 బడులు మూతబడ్డాయి. ప్రవేశాలు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈవో: జిల్లాలో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిపించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నాలుగు మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభించాం. బడిబాట కా ర్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, యూ నిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు నాణ్య మైన విద్య గురించి వివరిస్తున్నాం. ప్రతీ పా ఠశాలలో పరిశుభ్రత కోసం స్కావెంజర్లను నియమిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం టీచింగ్ పై అవగాహన కల్పిస్తున్నాం. ఈసారి అడ్మిష న్లు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.