
బడీడు పిల్లలు స్కూళ్లలో ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): బడీడు పిల్లలు స్కూళ్లలో ఉండాలని, ఆ దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పి.రమాదేవి అన్నారు. మండలంలోని అంబరావుగూడ గ్రామంలో మంగళవారం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. చదువుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల బాగో గుల కోసం చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపించొద్దని సూచించారు. చదివే వయస్సులో చిన్నారులను వ్యవసాయ పనులకు పంపించొద్దన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం దాము తదితరులు పాల్గొన్నారు.