
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నా రు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, విద్యాశాఖ కమిషనర్ యోగితారాణి, పంచాయతీరాజ్ కమిషనర్ లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. మంత్రి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు స్థలాలు ఎంపిక చేసి ప నులు నవంబర్ 30లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడు తూ జిల్లాలో 45,293 యూనిఫాంలకు 36వేలు సిద్ధం చేశామని తెలిపారు. మిగిలిన 9వేల యూని ఫాంలు మూడు రోజుల్లో పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు విద్యార్థులకు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా శక్తి భవనం కోసం స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించామని వివరించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో స్థలాన్ని ఎంపిక చేసి భారత్ పెట్రోలియం కంపెనీతో త్వరలో ఒప్పందం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, విద్యాశాఖ అధికారులు, డీపీఎంలు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తిచేయాలి
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను ఈ నెల 25లోగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, రిట ర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఓటరు జాబితా సవరణ, బూత్స్థాయి అధికారు ల నియామకం, గుర్తింపు కార్డుల జారీ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలో 1,200 మంది ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 30 వరకు ఉన్నాయని, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో 678 మంది బూత్స్థాయి అధికారులు పనిచేస్తున్నారని, 68 మంది బూత్స్థాయి అధికారుల సూపర్వైజర్లు ఉన్నారని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీలు త్వరగా భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.