
ప్రాజెక్టులు, కాలువలు పరిశీలన
దహెగాం/కాగజ్నగర్రూరల్: దహెగాం మండలం కల్వాడ సమీపంలోని పీపీరావు ప్రాజెక్టు, కాగజ్నగర్ మండలంలోని జగన్నాథ్పూర్ ప్రా జెక్టుతోపాటు కాలువలను సోమవారం కేంద్ర పెట్రోలియం సహాజ వనరుల గ్యాస్ జాయింట్ సెక్రెటరీ వినోద్ శేషన్, కేంద్ర భూగర్భ జలవనరుల ఈఈ వెంకటేశ్వర్లు, బృందం సభ్యులు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను అడిగి ప్రాజెక్టు, కాలువల పరిస్థితిపై వివరాలు సేకరించారు. ప్రాజెక్టు స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ట్రాక్టర్, బైక్పై వెళ్లి పలు కాలువలను పరిశీలించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
ప్రాజెక్టు పూర్తి చేయాలి
జగన్నాథ్పూర్ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి రైతులకు సాగు నీరందించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న కోరారు. సోమవారం జగన్నాథ్పూర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర బృందాన్ని కలిసి వినతిపత్రం అందించారు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.