
నియామకాలపై విచారణ చేపట్టాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్య కళాశాలలో ఇటీవల చేపట్టిన నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద సోమవారం రోడ్డుపై నిరసన తెలిపారు. అనంత రం అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భుక్యరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవల 52 ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పో స్టులను అర్హులతో కాకుండా డబ్బులు ఎక్కు వ ఇచ్చిన వారితో భర్తీ చేశారని ఆరోపించా రు. అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చే యకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తుకారాం, వినోద్, శ్యాంరావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.