
ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం
ఆసిఫాబాద్రూరల్: ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరా డుతామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుకారాం, మాణిక్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవా రం ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ని జాం ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కో సం ముగ్దు మొహినుద్దీన్ 1947లో ఎస్టీయూ ను ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు పూర్తికాక ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం సరికాదన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ సంజయ్ కుమార్, నాయకులు జంగు, నగేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.