
జీవో 49 రద్దు చేయాలి
వాంకిడి: టైగర్జోన్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజ య్కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని మోకాసిగూడ(ఇందాని)లో సోమవారం టైగ ర్ జోన్ ఏర్పాటుకు నిరసనగా గ్రామస్తులతో కలిసి నల్ల జెండా ఎగురవేశారు. ఆయన మా ట్లాడుతూ అటవీశాఖ అధికారుల విధానాలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటవీ అనుమతుల కారణంగా గిరిజన గ్రామాలు అభివృద్ధి దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆపకపోతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.