పీఎస్సార్‌ను కలిసిన మీనాక్షి నటరాజన్‌ | - | Sakshi
Sakshi News home page

పీఎస్సార్‌ను కలిసిన మీనాక్షి నటరాజన్‌

Jun 9 2025 7:41 AM | Updated on Jun 9 2025 7:41 AM

పీఎస్సార్‌ను కలిసిన మీనాక్షి నటరాజన్‌

పీఎస్సార్‌ను కలిసిన మీనాక్షి నటరాజన్‌

మంచిర్యాలటౌన్‌: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివా సంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లు కలిశారు. పీఎస్సార్‌కు కాకుండా చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారిద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్‌కే మంత్రి పదవి వస్తుందనే అంతా భావించారు. తీరా రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement