
మూతపడిన పాఠశాలను తెరిపించాలి
కాగజ్నగర్రూరల్: మండలంలోని వల్లకొండ గ్రా మంలో మూతపడిన మండల పరిషత్ పాఠశాలను వెంటనే తెరిపించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ప్రచారజాత కార్యక్రమంలో భా గంగా వల్లకొండ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో గతేడాది నుంచి పాఠశాల మూతపడి ఉండడంతో విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపించండం ఇబ్బందిగా మారిందన్నారు. టీఎస్ యూటీఎఫ్ నాయకులు కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయుడు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రచార జాతలో జిల్లా కార్యదర్శి రాజ్కమలాకర్ రెడ్డి, సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.