
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
కాగజ్నగర్టౌన్: దేశ వ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పా ల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ, ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ శతాబ్దికాలం నుంచి కార్మిక నాయకులు పోరాడి సాధించుకున్న 29 కార్మి క చట్టాలను సవరించి ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపడుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముంజం శ్రీనివాస్, రాజేందర్, ఆర్.త్రివేణి, ఎన్.పద్మ, కృష్ణమాచారి, శంకర్, చంద్రన్న, మాయ, రూప, శారద తదితరులు పాల్గొన్నారు.