విద్యా సంక్షేమం కోసం కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యా సంక్షేమం కోసం కృషి

Jun 9 2025 7:41 AM | Updated on Jun 9 2025 7:41 AM

విద్యా సంక్షేమం కోసం కృషి

విద్యా సంక్షేమం కోసం కృషి

● ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యా సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో పీఎం జన్‌మన్‌ పథకంలో భాగంగా మంజూరైన వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం హాస్టల్‌ వసతి కోసం పీఎం జనమన్‌ పథకంలో రూ.2.30 కోట్లతో వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వసతిగృహాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని, జిల్లాలో విద్యా సంక్షేమ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇన్‌చార్జి డీఈవో కాకుండా రెగ్యూలర్‌ డీఈవోను కేటాయించాలని గతంలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా రెగ్యూలర్‌ డీఈవోను నియమించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌, ఎంఈవో సుభాష్‌, ఇంజనీరింగ్‌ సిబ్బంది కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement