పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

Jun 6 2025 6:15 AM | Updated on Jun 6 2025 6:15 AM

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

● సింగరేణి డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావు

జైపూర్‌: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, లేనిపక్షంలో మానవ మనుగడ సాధ్యం కాదని సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) డి.సత్యనారాయణరా వు తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మ ల్‌ పవర్‌ ప్లాంటులో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వీస్‌ భ వనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడానికి బాధ్యతగా మొక్కలు నాటాలని, కర్బన ఉద్గారాలను తగ్గించాలని కోరారు. ఎస్టీపీపీలో ఏటా మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు. ప్లాంటు ఆవరణలో భూగర్భ జలమట్టం పెంచడానికి నీటి బిందువు–జల సిందువు కార్యక్రమం ద్వారా ఐదు మినీ చెరువులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్టీపీపీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, వోఅండ్‌ఎం చీఫ్‌ జెన్‌సింగ్‌, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్‌ సెక్రెటరీ సంతోష్‌కుమార్‌, ఏజీఎంలు మురళీధర్‌, మదన్‌మోహన్‌, పవర్‌మేక్‌ హెడ్‌ అఖిల్‌కపూర్‌, డీజీఎంలు అజాజుల్లాఖాన్‌, తుకారాం, వాసుదేవమూర్తి, ఫారెస్టు మేనేజర్‌ చంద్రమణి పాల్గొన్నారు.

మొక్కలు నాటిన న్యాయమూర్తి

బెల్లంపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కన్నాల శివారులోని నూతన కోర్టు ఆవరణలో బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యా యమూర్తి జే.ముఖేష్‌ గురువారం న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. అటవీ రేంజ్‌ అధికారి పూర్ణచందర్‌, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement