
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
● ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లావాసులకు నిరంతరం అందుబాటులో ఉండి, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని నూతన ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. ఇదివరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన డీవీ శ్రీనివాస్రావు మెదక్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో పాటిల్ కాంతిలాల్ సుభాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ క ట్టుబడి ఉంటుందని, పౌరుల రక్షణ పోలీసుల ప్ర ధాన లక్ష్యమన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా మతపర దూషణలకు పాల్పడినా, సామాజిక మాధ్యమాల్లో చెడు ప్రచారం చేసినా, ఇతరుల మనోభావాలకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
2020 ఐపీఎస్ బ్యాచ్..
పాటిల్ కాంతిలాల్ సుభాష్ 2020 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. 2022లో పాటిల్ కాంతిలాల్ భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీగా పని చేశారు. 2023 జనవరి నుంచి 2024 జూలై వరకు నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీగా, 2024 జూలై నుంచి హైదరాబాద్ సౌ త్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. ప్ర స్తుతం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.