
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు రోహన్, దీపిక జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. బుధవారం పాఠశాల అవరణలో పీడీ తిరుపతితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 30న మధ్యప్రదేశ్లో జరిగిన నెట్బాల్ సబ్ జూనియర్ జాతీయస్థాయి పోటీల్లో సదరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించారన్నారు.
పునరావాస కేంద్రానికి తరలించాలి
ఆసిఫాబాద్అర్బన్: కెరమెరి మండలంలోని దేవుడుపల్లి గ్రామాన్ని పునరావాస కేంద్రానికి తరలించాలని జాతీయ మానవ హక్కుల కమిటి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ 14 ఏళ్లక్రితం కుమురం భీం ప్రాజెక్టు(ఆడ) ముంపు ప్రాంతంగా గుర్తించి వారికి పరిహారం అందజేయడంతో పాటు మరోచోట 14 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. కానీ నేటికీ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయలేదన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు కూలిపో యే పరిస్థితి ఉందని, పునరావాస కేంద్రంలో పనులు పూర్తిచేసి అందులోకి తరలించాలన్నారు.

జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ