పర్యావరణ దినోత్సవంపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ దినోత్సవంపై సమీక్ష

Jun 5 2025 7:32 AM | Updated on Jun 5 2025 7:32 AM

పర్యావరణ దినోత్సవంపై సమీక్ష

పర్యావరణ దినోత్సవంపై సమీక్ష

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో గురువారం ని ర్వహించనున్న ప్రపంచ పర్యావరణ వేడుకల నిర్వహణపై బుధవారం ఏరియా ఎస్‌వోటూ జీఎం రాజమల్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అఽధిపతులకు వేడుకల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏరియా ఇంజినీరు రామనాథం, డీజీఎం కృష్ణమూర్తి, ఎస్‌కే మదీనా బాషా, సీహెచ్‌పీ ఇన్‌చార్జి కోటయ్య, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి హరీశ్‌ పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

రెబ్బెన: సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సింగరేణి పరిసర ప్రాంత యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి చదివి 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. గ్యాస్‌ చార్జింగ్‌(ఏసీఅండ్‌ ఫ్రిజ్‌)కు 15 రోజులు, ఏసీ ఇన్‌స్టాలేషన్‌, వాటర్‌ ప్యూరిఫయర్‌ రిపేర్‌కు 30 రోజులు, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషిన్‌, డిష్‌ వాషర్‌, ఏసీ రిపేర్‌, ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ గ్యాస్‌ చార్జింగ్‌ కోసం 90 రోజులు, ఎల్‌టీవీ, ఎల్‌ఈడీ మానిటర్‌, మైక్రో ఓవెన్‌, వాటర్‌ ప్యూరిఫయర్‌ అండ్‌ బేసిక్‌ హెచ్‌ఏ రిపేర్‌, ఇన్‌స్టాలేషన్‌ కోసం 90 రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల యువతీ, యువకులు ఈనెల 20 సాయంత్రం 5 గంటల్లోగా గోలేటిలోని జీఎం కార్యాలయంలో గల పర్సనల్‌ డిపార్టుమెంట్‌లో లిఖిత పూర్వక దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలకు 9951214116 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement