వైద్యకళాశాల విద్యార్థులకు శుద్ధజలం | - | Sakshi
Sakshi News home page

వైద్యకళాశాల విద్యార్థులకు శుద్ధజలం

Jun 4 2025 12:17 AM | Updated on Jun 4 2025 12:17 AM

వైద్యకళాశాల విద్యార్థులకు శుద్ధజలం

వైద్యకళాశాల విద్యార్థులకు శుద్ధజలం

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ వైద్య కళాశాలల వి ద్యార్థులకు శుద్ధజలం అందిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. మంగళవారం అంకుసాపూర్‌లో వైద్యకళాశాలను అదనపు కలెక్టర్‌ దిపక్‌ తివారీ, డీఎంహెచ్‌వో సీతారాంతో కలిసి సందర్శించారు. శుద్ధజల ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఇ టీవల పొరుగు సేవల్లో ఎంపికై న 52 మంది ధృవపత్రాలు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆ హారం, బోధన అందించాలని సూచించారు. కళాశాలలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరి ష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మి, ఆస్పత్రి పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో ఈ నెల 6నుంచి 19వరకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సూచించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో డీఈవో యాదయ్యతో కలిసి సంబంధిత అధికా రులతో సమావేశమై మాట్లాడారు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని తెలిపారు. ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మాస్టర్‌ మైండ్స్‌ ద్వారా నిర్వహించనున్న ఆన్‌లైన్‌ తరగతుల పోస్టర్‌ ఆవిష్కరించారు. ఎస్వోలు శ్రీనివాస్‌, మధుకర్‌, అబిద్‌ అలీ, డివిజన్‌ పంచా యతీ అధికారి ఉమర్‌ హుస్సేన్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement