టైగర్‌జోన్‌ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

టైగర్‌జోన్‌ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

Jun 4 2025 12:17 AM | Updated on Jun 4 2025 12:17 AM

టైగర్‌జోన్‌ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

టైగర్‌జోన్‌ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని ఆదివాసీల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకువస్తున్న కాగజ్‌నగర్‌ టైగర్‌ జోన్‌ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకో వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆదిమ గిరిజన భూరక్షణ పోరాట కమిటీ, రాజ్‌గోండ్‌ సేవా సమితి, గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆరోరోజుకు చేరింది. దీక్ష శిబిరా న్ని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించి సంఘీభా వం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. టైగర్‌జోన్‌ పేరుతో ప్రభుత్వం భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించా రు. టైగర్‌ జోన్‌ ఏర్పడితే ఆదివాసీల జీవితాలు ఛి ద్రమవుతాయని తెలిపారు. పోడు సాగు చేస్తున్న రై తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వల అటవీశాఖ అధికారులతో అక్రమ కేసులు పెట్టిస్తోందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అనుమతులివ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలకు తాను అండగా ఉంటానని, ఇప్పటికై నా అధికారులు గిరిజనుల హక్కులకు అడ్డుకునే ప్ర యత్నం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించా రు. కుమురంభీం పోరాట స్ఫూర్తితో ఆదివాసీలు ఐక్యంగా దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘం నాయకులు సిడాం అర్జు, బుర్స పోచయ్య, మడావి శ్రీనివాస్‌, పెందూర్‌ సుధాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement