
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
ఆసిఫాబాద్రూరల్: తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమా రి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎంఈవో సుభాశ్, సంఘం నాయకులతో కలిసి యూ టీఎఫ్ బడిబాట ప్రచార జాతను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బడి బాధ్యత మనదే అనే సంకల్పంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బడిబాట జాత నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 36 పాఠశాలలు మూతబడినట్లు సమాచారం ఉందని, వి ద్యార్థులు ఉన్నచోట వాటిని తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ పరిధిలోని బాబాపూర్ తండాలో పదేళ్ల క్రితం పాఠశాల మూతపడిన విషయం తె లుసుకుని, గ్రామంలో ఇంటింటికీ తిరిగి 15 మంది విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించామని తెలిపారు. డీఈవో యాదయ్య దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి, పాఠశాలను పునఃప్రారంభిస్తామని తెలిపా రు. కార్యక్రమంలో ఎస్వో మధుకర్, యూటీఎఫ్ నాయకులు ఇందురావు, రమేశ్, హేమంత్, రాజకమలాకర్ రెడ్డి, తిరుపతి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.