
ముగిసిన విత్తన పూజలు
మర్రిచెట్టు వద్ద పూజలు చేస్తున్న భక్తులు
భేటింగ్ అవుతున్న మహిళలు
ఆదివాసీల దైవక్షేత్రం జంగుబాయి అమ్మవారి చెంత విత్తన పూజలు ముగిశాయి. కెరమెరి మండలంలోని అటవీ ప్రాంతంలో గల జంగుబాయి అమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 1న ప్రారంభమైన పూజోత్సవం శుక్రవారం వరకు కనుల పండువగా కొనసాగింది. మర్రిచెట్టు, పోచమ్మ, రావుడ్, మైసమ్మ వద్ద జిల్లాతోపాటు తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 150 మేళంలు అమ్మవారిని దర్శించుకున్నాయని కటోడాలు, ఆలయ కమిటీ సభ్యులు శ్యాంరావు, బాపూరావు తెలిపారు. కప్లై, సిద్దికస, దారికస, విజ్జకస, టొప్లకస ప్రాంతాల్లోని పవిత్ర నదుల నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి శుక్రవారం ఉదయం దేవతల విగ్రహాలను శుద్ధి చేశారు. శుద్ధి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. కాగా, ఈ ఏడాది నీటి ఎద్దడి కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – కెరమెరి

ముగిసిన విత్తన పూజలు

ముగిసిన విత్తన పూజలు

ముగిసిన విత్తన పూజలు