
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కౌటాల(సిర్పూర్): రైతులు పండించిన వరి పంట చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేపడతా మని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కౌటాల మండలం సాండ్గాం, వీరవెల్లి, సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిల్లుల కు వచ్చిన వాహనాల నుంచి ధాన్యాన్ని తక్షణమే ది గుమతి చేసుకుని వాహనాలను తిరిగి పంపించాలన్నారు. కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఆర్డీవో దత్తారావు, జిల్లా సహకార సంఘం అధికారి బిక్కు, తహసీల్దార్ ప్రమోద్, ఏపీఎం ముక్తేశ్వర్, నిర్వాహకులు ఉన్నారు.