ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

May 31 2025 1:16 AM | Updated on May 31 2025 1:16 AM

ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆదిమ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్య డిమాండ్‌ చేశారు. అదిమగిరిజన భూరక్షణ పోరాట సమితి, రాజ్‌గోండ్‌ సేవా సమితి, గోండ్వానా పంచాయతీ రాయిసెంటర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వాలన్నారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూయజమానుల వివరాలు భూభారతి పోర్టల్‌ నమోదు చేసి బ్యాంకుల నుంచి రుణాలందించాలన్నారు. విద్యు త్‌ సౌకర్యం కల్పించి గిరి వికాస్‌ పథకం కింద బో ర్లు, బావులు వేయించాలని కోరారు. పోడు రైతుల మరణం తర్వాత వారసులకు ఇబ్బందులు లేకుండా వారసత్వ పట్టాలు చేయించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూముల్లో చెట్లు, కందకాల తవ్వకం నిలిచివేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతా యని స్పష్టం చేశారు. నాయకులు మడావి శ్రీని వాస్‌, నర్సింగ్‌రావ్‌, చందన్‌షా, పెందూర్‌ సుధాకర్‌, సిడాం అర్జుమాస్టర్‌, ఆదివాసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement