
నూతన షావెల్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో నూతన షావెల్కు సింగరేణి అధికారులు ‘ఆపరేషన్ సిందూర్’గా నామకరణం చేశారు. ఈ యంత్రాన్ని గురువారం ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో మెరుగైన ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు యంత్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. యంత్రాల పనితీరును ఎప్పటిప్పుడూ పర్యవేక్షించాల న్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, కైరిగూడ ఓసీపీ ప్రాజెక్టు అధికారి నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ రామనాథం, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.