నీటి గుంతలు.. గుండెకోతలు | - | Sakshi
Sakshi News home page

నీటి గుంతలు.. గుండెకోతలు

May 30 2025 1:52 AM | Updated on May 30 2025 1:52 AM

నీటి

నీటి గుంతలు.. గుండెకోతలు

కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్‌ లక్ష్మి(13), మహారాష్ట్రలోని ఎటపల్లికి చెందిన సిండే హన్సిక(11) ఈ నెల 23న వ్యవసాయ చేనుల్లోకి బహిర్భూమికి వెళ్లారు. అక్కడి నుంచి ఆడుకుంటూ చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు. నీళ్లలో కనిపించిన ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు లక్ష్మి గుంతలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు హన్సిక చెయ్యి పట్టుకోగా.. ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్‌(16) ఈ నెల 24న సమీపంలోని పెద్దవాగులో స్నానం చేసేందుకు వెళ్లాడు. వాగులో మునిగి మృతి చెందగా, ఆ తర్వాతి రోజు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు.

తేడాది ఫిబ్రవరి 11న చింతలమానెపల్లి మండల కేంద్రం సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు తుమిడే హరీశ్‌, కంబాల మహేశ్‌ ప్రాణా లు కోల్పోయారు. యువకులిద్దరూ బైక్‌పై శుభకార్యానికి వెళ్లి మార్గమధ్యలో సేదతీరేందుకు చేను వద్ద ఆగారు. వ్యవసాయ బావికి రక్షణ గోడ లేకపోవడంతో రాత్రిపూట బావిని గుర్తించక అందులోపడి మృతి చెందారు.

కౌటాల(సిర్పూర్‌): ఊరికి ఉపకారం చేసే చెరువులు, జలాశయాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరదాగా నీటి వనరుల వద్దకు వెళ్లిన వారు వివిధ కారణాలతో వాటిల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు, చెరువులు, కుంటల వద్ద మట్టి కోసం తవ్వడంతో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడుతున్నాయి. నీటి లోతు తెలియక అందులో దిగినవారు ప్రమాదాల బారినపడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు గుండె కోత మిగులుస్తున్నారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో నిండుగా ఉండే చెరువులు, బావులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. నీటికుంట చుట్టూ రక్షణ లేకపోవడంతో బాలికలు జారి పడినట్లు తెలుస్తోంది.

కనిపించని హెచ్చరిక బోర్డులు

జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలో వ్యవసాయ బావులతోపాటు లోతైన నీటి కుంటలు ఉన్నాయి. అక్కడ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జనసంచారం ఎక్కువగా ఉండే చాలాప్రాంతాల్లో రోడ్డు పక్కన వ్యవసాయ బావులున్నా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న బావులు, మూలమలుపులు, కల్వర్టులు కూలిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇష్టారీతిన తవ్వకాలు..

చెరువులు, కుంటల్లో మొరం, మట్టి కోసం ఇష్టారీ తిన తవ్వకాలు చేపడుతున్నారు. ఈ గుంతలు చే పల వేటకు వెళ్లిన వారిని, సరదాగా ఈత కోసం వెళ్లే చిన్నారులను బలి తీసుకుంటున్నాయి. చెరువులు, కుంటలను ఇరిగేషన్‌ శాఖ పర్యవేక్షిస్తోంది. మొరం తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలి. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఫీజు చెల్లిస్తే పర్మిషన్‌ ఇస్తారు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి.

ప్రాణాలు తీస్తున్న చెరువులు, జలాశయాలు

ప్రమాదకరంగా వ్యవసాయ బావులు

రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు

ఇటీవల కౌటాలలో ఇద్దరు చిన్నారులు మృతి

రక్షణ చర్యలు చేపడతాం

వేసవిలో పిల్లలు గంటల తరబడి నీళ్ల చెంతనే ఆడుతుంటా రు. తోటి వారిని అనుకరిస్తూ ఈత రాకున్నా నీళ్లలోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. వారిపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ ఉంచాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పకుండా సమాచారం తెలుసుకోవాలి. పంచాయతీ అధికారులతో కలిసి ప్రమాదకరంగా ఉన్న గుంతలను గుర్తించి రక్షణ చర్యలు చేపడతాం.

– రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

నీటి గుంతలు.. గుండెకోతలు1
1/2

నీటి గుంతలు.. గుండెకోతలు

నీటి గుంతలు.. గుండెకోతలు2
2/2

నీటి గుంతలు.. గుండెకోతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement