
ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని కేజీబీవీలు, ఎస్ఎస్ఏ యూఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం డీఈవో యాదయ్యకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ జిల్లాలో భార్యాభర్తలుగా ఉన్న ఉపాధ్యాయులు వివిధ మండలాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఒకే మండల పరిధిలో డిప్యూటేషన్ అవకాశం కల్పించాలన్నారు. సమగ్ర శిక్షాలో పనిచేసిన వారిని ఏప్రిల్ 24న తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి రాజ్ కమలాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.