
రోస్టర్ ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ రోస్టర్ ప్రకారమే చేపడుతున్నామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. ఎస్సీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు గురువారం బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. ఏరియా జీఎం కమిటీ సభ్యులకు గోలేటిలోని జీఎం కార్యాలయంలో స్వాగతం పలికి మొక్క అందించారు. అనంతరం ఏరియాలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగు ల రోస్టర్ను కార్పొరేట్ చీఫ్ లైసెన్ అధికారి దుర్గం రాంచందర్ తనిఖీ చేశారు. ఖాళీల భర్తీ, పదో న్నతులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, కమిటీ సభ్యులు రాజేశ్వర్, వెంకటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, కె.తిరుపతి, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమం సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.