
హోరాహోరీగా క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలు మూడోరోజు గురువారం హోరాహోరిగా సాగాయి. మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ స్కూల్లో గ్రీన్, బ్లూ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బ్లూ జట్టు 268 పరుగులు చేసి విజయం సాధించింది. హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలియన్లో నిర్వహించిన పోటీల్లో యెల్లో జట్టు 165 పరుగులు చేసి విజయం సాధించింది. మందమర్రిలోని సింగరేణి మైదానంలో జరుగుతున్న పోటీల్లో వైట్ జట్టు 229 పరుగులు చేసి విజయం సాధించిందని హెచ్సీఏ కోచ్ ప్రదీప్ తెలిపారు.