
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేష న్ పరిధిలో జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సీఐ స్వామి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన దాడి ఆకాష్ (21), అల్లకొండ కళ్యాణ్ (23) శుభకార్యాలకు డెకరేషన్ చేస్తుంటారు. బుధవారంరాత్రి ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆకాష్ అదేరోజు రాత్రి, కళ్యాణ్ గురువారం మృతి చెందారు. ఆకాష్ తండ్రి రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..
భైంసారూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ నైలు తెలిపిన వివరాల మేరకు మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ (20) బుధవారం రాత్రి చాక్పెల్లి వెళ్లేందుకు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై నిలబడి ఉన్నాడు. ఈక్రమంలో భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కన్నెపల్లిలో ఒకరు..
దండేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన బోరె మహేశ్ (40) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై కన్నెపల్లి నుంచి లక్సెట్టిపేటకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రైలులోంచి కిందపడి వ్యక్తి..
బెల్లంపల్లి: రైలులోంచి కిందపడి ఒకరు మృతి చెందినట్లు బెల్లంపల్లి జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కె.సురేష్గౌడ్ తెలిపారు. నాగపూర్కు చెందిన నిషాంత్ (42) బుధవారం రాత్రి హుబ్లీలో ఉన్న తన బంధువుల ఇంటికి వారణాసి ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకోగానే నిషాంత్ రైలులో నుంచి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహానికి గురువారం పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి భార్య పూర్వీకి అప్పగించామని రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
మోసగించిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన హైదరాబాద్లోని మణికొండకు చెందిన జెలిగం విజయ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన తుర్పటి గంగాధర్కు ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిందితుడు రూ.7లక్షల 5వేలు తీసుకున్నాడు. నకిలీ ప్రొసిడింగ్ ఇచ్చి జాబ్ వచ్చిందని నమ్మబలికాడు. ఆ తర్వాత అతను అక్కడికి వెళ్లగా నకిలీ ప్రొసిడింగ్ అని తెలుసుకున్నాడు. మోసపోయానని గ్రహించి గురువారం వన్టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.