
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాజీవ్వ్నగర్కు చెందిన కొండేటి సతీశ్ (38) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై సత్తయ్య తెలిపారు. మేసీ్త్రపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సతీశ్ ఇటీవల రెండు ప్లాట్లు కొనుగోలు చేసి ఇంటినిర్మాణం చేపట్టాడు. ఈక్రమంలో అప్పులు చేశాడు. అంతేకాకుండా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. ఒకవైపు అప్పులబాధ, మరోవైపు కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే వరండాలో ఒంటరిగానే పడుకున్నాడు. తెల్లవారేసరికి రేకుల షెడ్డుకు ఉరేసుకుని కనిపించాడు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అతని తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.
కొత్తూర్లో యువకుడు..
ఆదిలాబాద్టౌన్: తలమడుగు మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఉల్లెంగుల రవి (36) బుధవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఖుర్షీద్నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న రవి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.
రావి శ్రీనివాస్పై కేసు నమోదు
కాగజ్నగర్రూరల్: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును అసభ్య పదజాలంతో ధూషించిన కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై సురేశ్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టు చేసినట్లు తెలిపారు. రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
బెజ్జూర్: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని గురువారం బీజేపీ కార్యకర్తలు బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాడి తిరుపతి, మండల మాజీ అధ్యక్షుడు జాడి దిగంబర్, నాయకులు వసీఉల్లాఖాన్, తాళ్ల ఇందిరా, రాజారామ్, ప్రవీణ్, కిష్టయ్య, కృష్ణ, శ్యాంసుందర్, రుషి, గోపాల్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య