
‘గురుకుల సొసైటీ కార్యదర్శిని తొలగించాలి’
బెల్లంపల్లి: గురుకుల విద్యాలయ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణిని ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు మరుగుదొడ్లు కడిగితే తప్పేంటని, గదులు శుభ్రం చేసుకోవడంతో పాటు కూరగాయలు తరగాలని, ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎస్సీలకు చెందిన ఉన్నతాధికారిని గురుకుల సొసైటీ కార్యదర్శిగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు రమేశ్, నారాయణ, రాజ్కుమార్, ప్రసాద్, శేఖర్, శివాజీ, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
నేడు వైద్యారోగ్య శాఖలో ఖాళీలకు ఇంటర్వ్యూలు
మంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎన్హెచ్ఎం విభాగంలో ఖాళీగా ఉన్న రెండు నర్సింగ్ ఆఫీసర్, 1 డీడీఎం పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు నస్పూరులోని కలెక్టరేట్లో ఉన్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జిల్లా అధికారిక వెబ్సైట్ https:// mancherial. telangana. gov. in లో సంప్రదించాలని తెలిపారు.
తర్లపాడ్లో అగ్నిప్రమాదం
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్లో గురువారం రాత్రి పల్లపు లక్ష్మి ఇంట్లో కట్టెలపొయ్యి వద్ద వంట చేస్తుండగా ప్ర మాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫైరింజన్కు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది మంటలు ఆర్పివేశారు.