
హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
శ్రీరాంపూర్: కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కంపెనీ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. గురువారం ఆ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ 1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యజమాన్యంతో చర్చించామన్నారు. త్వరలోనే ఆస్పత్రి పనులు ప్రారంభమవుతాయన్నారు. అంతే కాకుండా భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం సెక్టార్3లలో కార్మికుల పిల్లల కోసం సింగరేణి పాఠశాలలో సీబీఎస్ సిలబస్ను ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ఈ సందర్భంగా 30 మంది కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారికి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రాంచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.