
మొక్కజొన్నల చోరీ నిందితుల అరెస్ట్
నర్సాపూర్(జి): ఏప్రిల్ 23న 325 క్వింటాళ్ల మొక్కజొన్నలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితుడు కల్లూరుకు చెందిన బొద్దుల శ్రీనివాస్ మే13న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ జానకీ షర్మి ల ఆదేశాలతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచా రణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండకు చెందిన బాదావత్ సంతోశ్, కంటేశ్వర్కు చెందిన అబ్దుల్ రజాక్ లారీ డ్రైవర్లు 325 క్వింటాళ్ల మొక్కజొన్నలను కామారెడ్డి సమీపంలో ఉన్న స్నేహా చికెన్ ఫార్మ్ గోదాంకు పీవీ ఏజెన్సీ ద్వారా విక్రయించి రూ.7,48,000 సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్దనుంచి 2 లారీలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.