ఈతకు వెళ్లి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

May 26 2025 9:58 AM | Updated on May 26 2025 9:58 AM

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్‌(16) పెద్దవాగులో ఈతకు వెళ్లి మృతి చెందినట్లు కాగజ్‌నగర్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్‌ ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుని, ఆ తర్వాత పెద్దవాగుకు స్నానం చేసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కు టుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. పెద్దవాగులో ఆదివారం మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి పిప్పిరే చరణ్‌దాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement