ఘనంగా భగీరథ మహర్షి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

May 5 2025 8:52 AM | Updated on May 5 2025 8:52 AM

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాజు భగీరథ మహర్షి జయంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భగీరథ మహర్షి గంగానదిని భూమికి తీసుకువచ్చేందుకు సంవత్సరాలపాటు తపస్సు చేశాడని చరిత్ర చెబుతుందని తెలిపారు. మహనీయు ల చరిత్ర, భారతదేశ విశిష్టతను భావితరాల కు అందించే విధంగా జయంతి, వర్ధంతి అధి కారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశా ఖ అధికారి సజీవన్‌, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్‌ రమేశ్‌, మాలి సంఘం నాయకులు శంకర్‌, అవుడపు ప్రణయ్‌, రుకుం ప్రహలాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement