
జేఏసీ పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు
రెబ్బెన(ఆసిఫాబాద్): కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల జీతాల పెంపుపై మేడే రోజు సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు లేదా జీవో నంబర్ 22 ప్రకారం నెలకు రూ.25వేలు తగ్గకుండా అందేలా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారిక కార్మిక వేడుకల్లో సీఎం కాంట్రాక్టు కార్మికులకు తీపి కబురు చెప్పాలని అన్నారు. కార్మికుల జీతాల పెంపుతోపాటు ఈఎస్ఐ వైద్య సౌకర్యం, 2022 సెప్టెంబర్ 26న సెంట్రల్ లేబర్ అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందంలోని అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏరియా నాయకులు మారిన వెంకటేశ్, సెంట్రల్ కమిటీ నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.