
సైక్లింగ్తో ఆరోగ్యం
ఆసిఫాబాద్అర్బన్: నిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆర్ఎస్ఐ రాజేశ్, గిరిజన క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు అన్నారు. ఈ నెల 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యపరమైన అలవాట్లు పెంపొందించడం, సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం సాధించడం, పర్యావరణ పరీరక్షణకు తోడ్ప డటం లక్ష్యంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా– సండేస్ ఆన్ సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అత్యాపత్యా ఇండియా కోచ్ కడ్తల రాకేశ్, శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు.