
తాగునీటి కోసం నిరసన
కౌటాల(సిర్పూర్): తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని మంగళవారం కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న చేతిపంపు వద్ద మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 20 రోజులుగా ఎస్సీ కాలనీలోని చేతిపంపు పనిచేయడం లేదని, మిషన్ భగీరథ నీరు సైతం సక్రమంగా రావడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికంగా బోర్లు ఉన్న వారిని నీళ్లు అడిగి తాగుతున్నామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యలు తీర్చాలని కోరారు.