
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
లింగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న జాముల్ధారలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదా రులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలని ఏపీఎం తిరుపతికి సూచించారు. అలాగే గ్రామంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు సిద్దిక్, రాకేశ్, డీఈఈ నరేశ్, ఎంపీడీవో రాంచందర్, ఏఈలు అరవింద్, కృష్ణతేజ, ఏపీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(యూ) మండల కేంద్రంలోని పంప్హౌజ్ను గురువారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేయాలన్నారు. పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.