వడదెబ్బతో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో యువకుడు మృతి

Apr 25 2025 8:28 AM | Updated on Apr 25 2025 8:28 AM

వడదెబ

వడదెబ్బతో యువకుడు మృతి

నిర్మల్‌టౌన్‌: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మపూరి కాలనీకి చెందిన మహ్మద్‌ బేగ్‌ కుమారుడు సోఫిబేగ్‌ (25) గత రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఇంట్లో మృతి చెందాడు. కాగా సోఫిబేగ్‌ మూడు నెలల క్రితం దుబాయ్‌ నుంచి నిర్మల్‌కు వచ్చాడు.

మేకల కాపరి..

ముధోల్‌: మండలంలోని మచ్కల్‌ గ్రామానికి చెందిన షెల్కే లింగురాం(58) అనే మేకల కాపరి వడదెబ్బతో మృతి చెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగురాం మేకలు కాస్తూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే బుధవారం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పెద్ద కుమారుడు గంగాధర్‌తో కలిసి మేకలను మేపుతున్నాడు. ఈక్రమంలో మిట్ట మ ధ్యాహ్నం ఒక్కసారిగా లింగురాం కుప్పకూలి పోయాడు. గంగాధర్‌ చెట్టు నీడకు తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా లింగురాం స్పందించలేదు. వెంటనే గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యుల కు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చే సరికి లింగురాం మృతి చెంది ఉన్నాడు. లింగురాంకు భార్య లక్ష్మి, కుమారులు గంగాధర్‌, శ్రావణ్‌, కుమార్తె పూజ ఉన్నారు.

బెల్లం, పటిక పట్టివేత

తాండూర్‌: జాతీయ రహదారి మీదుగా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా గురువారం ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన దుర్గం రాజ్‌కుమార్‌, దాగం సంజు, అజ్మీరా చందు అనే వ్యక్తులు బెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఐబీ తాండూర్‌ ప్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఎకై ్సజ్‌ అధికారులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు.

వడదెబ్బతో  యువకుడు మృతి1
1/1

వడదెబ్బతో యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement