
నిర్మల్లోనే నాణ్యమైన విద్య
● ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి
నిర్మల్టౌన్: హైదరాబాద్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మల్లోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థ నాణ్యమైన విద్య అందిస్తుందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్లో విద్యతో పాటు విలువలను అందిస్తామన్నారు.
టాపర్స్ వీరే..
ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్గా నర్వాడే కృష్ణవేణి 468/470, జోషి ప్రసూన శ్రీ 468/470, పడిగెల కీర్తిశ్రీ కి 468/470, బాలుర విభాగంలో బోనాల శ్రీ చరణ్ 467/470, వడకపూర్ అఖిల్ 467/470, కార్తికేయన్ 467/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సామ ఫిర్దోస్ 438/440, జోహా మహావీష్ 438/440, నబిలా తహరీమ్ 438/440 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో కవల్ ప్రీత్కౌర్ 995/100, సుమయ కణం 994/100, జాదవ్ నవ్యశ్రీ 993/1000 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.